Monday, April 13, 2015

పాఠశాల ఆరవ వార్షికోత్సవం

         పాఠశాల ఆరవ వార్షికోత్సవం శ్రీ మన్మథ నామ సంవత్సర ఉగాది నాడు కమ్యూనిటీ హౌస్ మిడిల్ స్కూల్లో జరిగింది. పోయినేడాది కూడా ఇక్కడే జరిగింది కాని, అప్పుడు పాఠశాలలో యాభై మూడు మంది విద్యార్ధులు, పదకొండు మంది ఉపాధ్యాయులు ఉన్నారు. ఈ ఏడాది నూటనాలుగు మంది విద్యార్ధులు, పంతొమ్మిది మంది ఉపాధ్యాయులు. అంటే సగటున ప్రతి ఐదుగురు విద్యార్ధులకు ఒక ఉపాధ్యాయులున్నారన్నమాట. ఇది పాఠశాల విద్యార్ధులు చేసుకున్న అదృష్టం. 
ఉపాధ్యాయులు 
వేలూరి రాధ, సూరే మంజుల, వాడకట్టు శైలజ, కింతలి అనురాధ ఉపాధ్యాయులుగానే కాక పాఠశాల అభివృద్ధి కోసం ఎంతో కృషి చేస్తున్నారు. 


        పడాల ఉష, మారోజు కవిత, సుంకే జ్యోతి, చెట్టా రమేష్, భైరి ఈశ్వరి, మేడికయాల లక్ష్మి, సూర్యదేవర హరిత, 
గుమ్మడి సుధ, మల్లాది శశికాంత్, బులుసు పద్మ, కాకాని లక్ష్మి, పాండవ రోహిణి, రామడుగు మాధురి, గండ్లూరి భాను ప్రకాష్ ఈ ఏడాది కొత్తగా వచ్చిన ఉపాధ్యాయులు.  ఏ పని చేయడానికి వాలంటీర్లు ఎవరూ ముందుకు రావడంలేదని వింటుంటాం. 


వచ్చినా వారు నిబద్దతతో పనిచెయ్యరని అపోహ. అలాంటిది ఏడాది పొడవునా ప్రతివారం ఓ సమయానికి కట్టుబడి పాఠాలు చెప్తున్న  ఈ ఉపాధ్యాయులందరికీ ధన్యవాదాలు. 


వీరు పాఠాలు చెప్పడమే కాదండి, పాఠశాల తరగతులను తమ ఇంట్లోనే  నిర్వహించడానికి సహృదయంతో ముందుకు వచ్చారు. ఒంట్లో బాగాలేని రోజులుంటాయి, ఆఫీసులో ఒత్తిడి, పిల్లలకు బాగా లేకపోవడం, చుట్టాలతో బిజీగా ఉన్న సందర్భాలు... ఇలా ఎన్నో ఉంటాయి.
సంవత్సరం మొదట్లో రూపొందించిన కాలెండర్ ప్రకారం ప్రతి వారం తరగతి నడిపే ఉపాధ్యాయులకు ఏమిచ్చినా ఋణం తీరదు. పైగా విద్యార్ధులు హోం వర్క్ చేయకపోయినా, ఎవరైనా కొంచెం వెనకబడుతూ ఉన్నా “ఆ పిల్లాడు చాలా బాగా చేస్తాడండి. ఇంట్లో వాణ్ని కూర్చోబెట్టి వాడేం చేస్తున్నాడో కొంచెం చూసేవాళ్ళుంటే బావుణ్ణు” అంటూ విద్యార్ధుల గురించి వీళ్ళు బాధపడి పోతారు. 

       ఇందులో ఆరుగురు టీచర్ల పిల్లలు పాఠశాల విద్యార్ధులు కారు.

అయినప్పటికీ వారు మాతృభాష మీద అభిమానంతో పాఠాలు చెప్పడానికి ముందుకు వచ్చారు. కొంత పని చేసి ఎంతో ప్రతిఫలం ఆశించే ఈ రోజుల్లో నిస్వార్ధంగా ఇంత సహాయం చేస్తున్న ఉపాధ్యాయులకు ఏడాదికి ఒక్క రోజు భోజనం పెట్టి తమ సంతోషం మేరకు వాళ్ళను సత్కరించాలనే తల్లిదండ్రుల ఆలోచనతో ఈ వార్షికోత్సవం. 

మా ఆహ్వానాన్ని మన్నించి విద్యార్ధులను ఆశీర్వదించడానికి డొక్కా ఫణి కుమార్ గారు రావడం ఓ విశేషం.
       ఈ ఏడాది మరో విశేషం పాఠశాల కొలంబియా, సౌత్ కేరోలినాలో మొదలవడం. ప్రముఖ కవి విన్నకోట రవిశంకర్ గారు, విద్యాసాగర్ గారు ఉపాధ్యాయులు. వారికి తమ ప్రోత్సాహం అందిస్తున్న వారు కొలంబియా తెలుగు అసోసియేషన్ అద్యక్షులు కడాలి సత్య గారు. 
కొలంబియా పాఠశాల బృందం 

ఎంతో మంది, ఎన్నో రోజుల కృషి ఫలితం ఈ వార్షికోత్సవం. తెర వెనుక
వుండి అహర్నిశలూ కష్టపడిన వారిని ఇప్పుడు పరిచయం చేస్తాను. 



వార్షికోత్సవ బాధ్యతలు భుజాన వేసికొని ఈ కార్యక్రమాన్ని నడిపించిన సమన్వయకర్త డోకి శ్రీనివాస్ గారు. ప్రణాళికా బద్దంగా ప్రతిపనికి 
ఓ సమయాన్ని కేటాయించి, వారానికో సమావేశం ఏర్పాటుచేసి, ప్రతి చిన్న విషయాన్నీ వివరంగా పరిశీలిస్తూ సమర్ధవంతంగా నిర్వహించారు.

       

విద్యార్ధుల కార్యక్రమాల గురించి ఉపాధ్యాయులతో మాట్లాడుతూ వారి సాధక బాధకాలను పరిశీలిస్తూ, అవసరం మేరకు సలహాలు సూచినలు ఇచ్చి వేలూరి రాధ గారు కష్టతరమైన కార్యాన్ని ఎంతో ఇష్టంగా నిర్వహించి దిగ్విజయంగా పూర్తి చేశారు. 

ఈ కార్యక్రమానికి ప్రణాళిక రూపొందించడం దగ్గర నుండి ఇప్పటి వరకు కీలక పాత్ర పోషిస్తున్నవారు సూరె మంజుల గారు. ఈ కార్యక్రమానికి నిర్వాహక బాధ్యత తీసుకుని కూడా కొత్తవారిని ప్రోత్సహించే ఉద్దేశ్యంతో వెనుకనే ఉండి ఈ కార్యక్రమాన్ని నడిపించారు.

ఒక కార్యక్రమం నిర్వహించాలంటే స్పీకర్లు, మైకులు, పాలు,
నీళ్ళు లెక్కలు, అప్పులు, వసూళ్ళు, వగైరా, వగైరా, వగైరా. ఈ హరైనా అంతా పడుతూ డాలర్ అడిగితే “క్వార్టర్ తో సర్దుకుందురూ” అంటూ కోత వేసి చాలా పొదుపుగా ఈ కార్యక్రమాన్ని బడ్జెట్ ప్రకారం నడిపిన వారు దేవినేని నీలిమ గారు. ఈవిడ ఫుడ్ కమిటీ లో కూడా ఉన్నారు. అక్కడ మాత్రం ఈవిడ అన్నపూర్ణే. నాలుగు ట్రేలు సరిపోతాయంటే “లేదండీ... ఆరైతే బెటర్” అంటూ వంటలన్నీ ఘనంగా వండించారు. 


       పాఠశాల తరగతుల నిర్వహణ కోసం తమ ఇంటిని వాడుకోమని
సహృదయంతో ముందుకొచ్చి సహాయం చేసిన వారు ముందుకు వచ్చినవారు మొగిలి షర్మిల గారు. అంతేకాదండి ఎప్పుడు ఉపాధ్యాయులకు ఇబ్బంది వచ్చినా ఆ తరగతిని నడపడానికి సహాయం చేశారు. తమ పిల్లలు పాఠశాల విద్యార్ధులు కానప్పటికీ మీకెప్పుడు అవసరమైనా నేనున్నానంటూ ఉపాధ్యాయులకు సహాయపడినవారు గుడితి వేణి గారు.                                                                                                            
తెలుగులో ప్రశంసా పత్రాలు తాయారు చేయడమే కాక, జ్ఞాపికల మీద కూడా తెలుగులోనే పేర్లు వ్రాయించి తెప్పించిన వారు వర్ధినేని వెంకట్ గారు. 

ఈ వార్షికోత్సవం జరుపుకోవడానికి మనకు వేదిక సమకూర్చిన వారు గొట్టిపర్తి వెంకట్ గారు. కేవలం ఒక్క గంటలో వేదిక అలంకరణ పూర్తి చేసి కార్యక్రమాన్ని నిర్ణీత సమయానికి మొదలయ్యేలా సహకరించిన వారు వాడకట్టు శైలజ గారు, వాడకట్టు సునీల్ గారు, పడాల సూర్య గారు, వేమూరి సత్య గారు, పుల్లేటి కల్యాణి గారు. 
ఎప్పుడు కొన్నారో ఎలా జాగ్రత్త చేసారో కానీ మనకు తాజా రోజాలను అందించిన వారు. అంబటి సరిత గారు, కింతలి అనురాధ.


వచ్చవాయ్ రామ్ కుమార్ ఈ కార్యక్రమానికి వీడియోలు తీయడమే వెంటనే యూ ట్యూబ్ లో పెట్టేశారు కూడా. ఆ వీడియోలను ఇక్కడ చూడొచ్చు. 

కార్యక్రమం మొదటినుండి ఓపిగ్గా ఫోటోలు తీస్తున్నారు ఫణి కుమార్ గారు, మల్లాది శశికాంత్ గారు. ఫణి కుమార్ గారు తీసిన ఫోటోలను ఇక్కడ, శశికాంత్ గారు తీసిన ఫోటోలను ఇక్కడ చూడొచ్చు. 

శశికాంత్ ఉపాధ్యాయులు కూడా. ఫణి కుమార్ గారి శ్రీమతి ఈశ్వరి పాఠశాల ఉపాధ్యాయులు. వీరు కూడా అవసరమైనప్పుడు తరగతి నిర్వహణలో సహాయం చేస్తుంటారు. 


కార్యక్రమమైన విజయవంతం అవడానికి అతిముఖ్యమైనవి. స్పీకర్లు, మైకులు. వాటిని తీసుకొచ్చి అమర్చి వాటి బాగోగులు చూస్తున్న వారు సుంకర శశికాంత్ గారు. 


తమ సరదా సంభాషణలతో సమర్ధవంతంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన వ్యాఖ్యాత పారుపూడి ఉష గారు.


కార్యక్రమానికి ఎంత మంది హాజరవుతారో చూసి అందరికీ సరిపడా భోజనం

తరయ్యేలా చూడడం శ్రమ కంటే వత్తిడితో కూడకున్న పని. వంటలు, వడ్డనల ఏర్పాట్లు చూస్తున్న వారు పుల్లేటి కళ్యాణి, పండ లక్షి, కుంట రంజని, దేవినేని నీలిమ. 

చదవలవాడ రాజా గారు, వేమూరి సత్య గారు అవసరమైన ప్రతి దగ్గర మేమున్నామంటూ ముందుకు వచ్చి అన్ని పనులూ సవ్యంగా జరిగేలా చూశారు.

ఈ వార్షికోత్సవంలో తమ ప్రజ్ఞా పాటవాలతో మనల్ని అలరించిన విద్యార్ధులకు అభినందనలు. వారికి ప్రోత్సాహం అందించిన తల్లిదండ్రులు ధన్యవాదాలు.


అచ్చతెలుగుపేర్లతో తయారయిన జ్ఞాపికలు 



ఒకటవ తరగతి 



ఒకటవ తరగతి 


ఒకటవ తరగతి 

ఒకటవ తరగతి 
ఒకటవ తరగతి 



మూడవ తరగతి విద్యార్ధులు 



పూర్వ విద్యార్ధులు 


రామ లక్ష్మణులు 


ప్రజ్ఞా పత్రాలు, జ్ఞాపికలు అందుకుంటున్న రెండవ తరగతి విద్యార్ధులు 



రామ రావణ యుద్ధం 


సింహము, కుందేలు కథ చెప్తున్న విద్యార్ధులు 


శ్రీ రామ విజయం నాటిక వేసిన నాలుగవ తరగతి విద్యార్ధులు 


సోది 

బుఱ్ఱ కథ 

ఉగాది పచ్చడి 


తల్లిదండ్రులు తమ స్వహస్తాలతో తయారుచేసిన విందు భోజనం 
తాంబూలాలు  


పాఠశాల వైభవాన్ని తమ దర్పణంలో ప్రతిబింబించిన ఐడియల్ బ్రెయిన్ , ఆంద్ర ప్రభ, అంతర్జాతీయ తెలుగు వార్తా వేదిక, తెలుగు కమ్యూనిటీ న్యూస్, తెలుగు టైమ్స్ పత్రికలన్నింటికీ ధన్యవాదాలు.

ఒక సంస్థ అభివుద్ది వైపు అడుగులు వేయాలంటే ఒక వ్యక్తి కాదు ఓ వ్యవస్థ కావాలన్న నిజాన్ని గ్రహించి నడుం కట్టి ముందుకొచ్చి వార్షికోత్సవాన్ని విజయపంథాలో నడిపించిన కార్యనిర్వాహకులందరికీ అభినందనలు.